రాజ్యసభ అభ్యర్థిగా ఖర్గే నామినేషన్ దాఖలు
బెంగళూరు: కర్ణాటక నుంచి రాజ్యసభకు(Rajya Sabha) తిరిగి ఎన్నికయ్యేందుకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శుక్రవారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఖర్గే పదవీకాలం జూన్ 25తో ముగియనుంది. ఏఐసీసీ పార్టీ అధ్యక్షుడితో పాటు నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి, కాంగ్రెస్ నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) న్యూఢిల్లీ నుంచి బెంగళూరుకు విమానంలో చేరుకున్నారు.
విధానసౌధలో అసెంబ్లీ కార్యదర్శి ఎం.కె. విశాలాక్షికి నామినేషన్ పత్రాలు సమర్పించిన ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు రణదీప్ సింగ్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్, పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. కలబురగికి చెందిన మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలోకి ప్రవేశించడానికి ముందు గుర్మట్కల్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.






