6 March, 2026 | 8:10 PM

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

26-03-2025 12:25 AM

12౦౦ గ్రాముల గంజాయి స్వాధీనం

ముషీరాబాద్, మార్చి 25, (విజయక్రాంతి): గంజాయి విక్రయాలకు  పాల్ప డుతున్న ఓ వ్యక్తి ని గాంధీనగర్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 1200 గ్రాముల గంజాయి ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఇన్స్పెక్టర్ రాజు తెలిపిన వివరాల మేరకు..న్యూ బోయిగూడ ఆల్ఫాతా హోటల్ వద్ద మంగళవారం సాయంత్రం 5 గంటలకు అండికోలు జగదీశ్ అలియాస్ జాగు అనే వ్యక్తి పర్లి వైజ్నునాథ్ నుండి హైదరాబాద్ లోని తన వినియోగదారులకు విక్రయిస్తూ జల్సాలకు   పాల్పడుతున్నారని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ డి. రాజు తెలిపారు..