16 April, 2026 | 12:01 PM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

26-03-2025 12:26 AM

అచ్చంపేట  మర్చి 25: బీసీ కులాలకు42% రిజర్వేషన్ కల్పించడంపై అచ్చం పేట నియోజకవర్గం అమరాబాద్ మండ లం మన్ననూర్ గ్రామంలో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నేతలు పాలాభిషేకం చేశారు.

ఉద్యమ ముసుగులో అధికారాన్ని చేపట్టిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల గొప్పగా మార్చి తన కుటుంబం మాత్రం ఆర్థికంగా ఎదిగిందని మండిపడ్డారు. అప్పు ల రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇప్పుడిప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధికి బాటలు వేస్తోందని ఈ ప్రాంత వాసిగా ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానం మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం గర్వించదగ్గ విషయం అన్నారు. పాలా భిషేకం నిర్వహించిన వారిలో కాంగ్రెస్ నేతలు వెంకటరమణ, సత్యనారాయణ, మా జీ వైస్ ఎంపీపీ వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ శ్రీను, బిసి నాయకులు కృష్ణయ్య తదితరులున్నారు.