అత్యాచారయత్నం.. 3 సంవత్సరాల జైలు శిక్ష
రాజన్నసిరిసిల్ల, విజయక్రాంతి: మూడు సంవత్సరాల క్రితం బాలికపై అత్యాచారానికి ప్రయత్నించిన వ్యక్తికి మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 2 వేలుజరిమానా విధిస్తూ సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్. ప్రేమలత సోమవారం తీర్పు వెల్లడించినట్లు పట్టణ సిఐ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్ల పట్టణానికి చెందిన 10సంవత్సరాలు బాలికపై 2023 సంవత్సరంలో ఒంటరిగా ఇంటికి వెళ్లే సమయంలో రాజీవ్ నగర్ కు చెందిన కొండ రాహుల్ అనే వ్యక్తి బాలికను పక్కనే వున్న ఖాళీ స్థలంలోకి తీసుకొని పోయి ఆమెపై హత్యాచారనికి ప్రయత్నించగా అతని నుండి తప్పించుకొని కుటుంబసభ్యులతో కలిసి సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, అప్పటి సిరిసిల్ల పట్టణ సీఐ అనిల్ కుమార్ నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష విధించినట్లు సీఐ బి.రఘుపతి తెలిపారు.






