10 July, 2026 | 12:04 PM

ప్రతి సమస్య ను పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి

10-06-2024 03:07 PM

మహబూబ్ నగర్: తన అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రజల చేత స్వయంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి  సోమవారం అర్జీలు స్వీకరించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్జీలు ఇచ్చిన వారి సమస్యలను ఆయన సావధానంగా విన్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణం పరిష్కారం అయ్యే సమస్యలకు ఆయన వెంటనే పరిష్కారించారు.  డబుల్ బెడ్రూం, ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి , పెన్షన్లు పైన ప్రజలు ఎమ్మెల్యే కు అత్యధిక అర్జీలు అందజేశారు. వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ వల్ల కొన్ని రోజులుగా ప్రజల అర్జీలు తీసుకోలేక పోయామని, ఇకనుంచి ప్రతి రోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. ప్రజల మధ్యన ఉంటూ ప్రజా సమస్యలను తీర్చడానికి  నిరంతరం కృషి చేస్తానన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల నిర్వహణ లో భాగంగా ఈ రోజు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం, రాజేంద్రనగర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, షా బజార్ పాఠశాలను మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ , మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డితో కలిసి పరిశీలించారు.