గ్రామసభలో ఆత్మహత్యాయత్నం.. పెన్షన్ నిలిచిపోయిందంటూ చెట్టెక్కాడు!
02-04-2026 04:24 PM
కాపాడిన పాలకవర్గం
భిక్కనూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామంలో ప్రజాపాలన గ్రామసభ ప్రాంగణంలో ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. అదే గ్రామనికి చెందిన గొల్ల రాములు (మూర్ఛవ్యాధితో బాధపడుతున్నడు)అనే వ్యక్తి గతంలో పొందిన పెన్షన్ ప్రస్తుతం నిలిచిపోయిందని, పలుమార్లు దరఖాస్తు చేసినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ చెట్టెక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే స్పందించిన గ్రామ పాలకవర్గ సభ్యులు అతన్ని సమయానికి కాపాడారు. సమస్యను పరిష్కరించి పెన్షన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనతో గ్రామంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.




