11-06-2025 06:39:04 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ మున్సిపాలిటీలోని ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం మున్సిపల్ సిబ్బంది దోమల మందు పిచికారి చేశారు. పాఠశాలలో పున ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పాఠశాలల్లో పారిశుధ్యం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అన్ని పాఠశాలల్లో పారిశుధ్యం, దోమల మందు పిచికారి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ సురేందర్, సానిటరీ ఇన్స్పెక్టర్ ఫిరోజ్, సూపర్వైజర్ మానాల శంకర్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.