12-06-2025 12:37:11 AM
ఘట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో ఘటన
ఘట్ కేసర్, జూన్ 11 (విజయక్రాంతి) : ప్రయాణిస్తున్న రైలుకు ఎదురెళ్లి ఢీకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఘట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసులను తెలిపిన వివరాల ప్రకారం ఘట్ కేసర్ పట్టణానికి చెందిన నీరుడు నర్సింగ్ రావు (36) స్థానికంగా నివాసం ఉంటూ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
బుధవారం మధ్యాహ్నం రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే గేట్ వద్ద కాజీపేట నుండి సికింద్రాబాద్ వెళ్తున్న రైలు ఇంజన్ వద్దకు ఎదురుగా వెళ్లి ఇంజన్ పైకి జంప్ చేసాడు. దీంతో రైలు ఇంజన్ రాడు శరీరంలోకి దిగి బలమైన గాయమై వేలాడుతు మృతి చెందాడు. అది గమనించిన రైలు డ్రైవర్ భాష ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ లో ఆపి రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదని రైల్వే పోలీసులు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుగుతున్నట్లు పోలీసులుతెలిపారు.