30-05-2025 12:57:05 PM
సారంగాపూర్ విజయక్రాంతి: ప్రజలు ప్లాస్టిక్ నిర్మూలనకు సహకరించాలని ఎంపివో అజీజ్ ఖాన్(MPO Aziz Khan) అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో ప్లాస్టిక్ నిర్మూలించేందుకు శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్లాస్టిక్ ఉపయోగం వల్ల కలిగే నష్టాలను అనర్థాలను వివరించారు. ప్లాస్టిక్ ఉపయోగం వల్ల కేవలం మనుషులకే కాకుండా మూగ జీవాలకు సైతం తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. ప్లాస్టిక్ నియంత్రణకు ప్రతి వ్యాపారి ప్రతి వినియోగదారు సహకరించాలని సూచించారు.ప్లాస్టిక్ ఉపయోగానికి బదులుగా నారా, బట్ట సంచులను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి కృష్ణా, గోపి కృష్ణ, చిరు వ్యాపారస్తులు, తదితరులు పాల్గొన్నారు.