30 April, 2026 | 12:22 AM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

12-03-2026 12:17 PM

​రాజాపూర్: మండల పరిధిలోని చెన్నవెల్లి గ్రామానికి చెందిన చిల్వర్ నరేష్ అనే యువకుడు గురువారం రాజాపూర్ శివారులో జాతీయ రహదారి పై ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు.  కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం చెన్నవెల్లి కి చెందిన చిల్వర్ నరేష్ ఎంఎస్ఎన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. విధులకు వెళ్లే నిమిత్తం  ఉదయం 5:30 గంటల ప్రాంతంలో తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, వెనుక నుంచి అతివేగంతో వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరేష్ అక్కడికక్కడే మృతి చెందారు.

​ఉపాధి కోసం తెల్లవారుజామునే విధులకు వెళ్తున్న యువకుడు ప్రమాదవశాత్తు మరణించడంతో చెన్నవెల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.మృతునికి భార్య ఇద్దరూ కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.