రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
రాజాపూర్: మండల పరిధిలోని చెన్నవెల్లి గ్రామానికి చెందిన చిల్వర్ నరేష్ అనే యువకుడు గురువారం రాజాపూర్ శివారులో జాతీయ రహదారి పై ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం చెన్నవెల్లి కి చెందిన చిల్వర్ నరేష్ ఎంఎస్ఎన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. విధులకు వెళ్లే నిమిత్తం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, వెనుక నుంచి అతివేగంతో వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరేష్ అక్కడికక్కడే మృతి చెందారు.
ఉపాధి కోసం తెల్లవారుజామునే విధులకు వెళ్తున్న యువకుడు ప్రమాదవశాత్తు మరణించడంతో చెన్నవెల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.మృతునికి భార్య ఇద్దరూ కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.




