ఆటో ఢీకొని వ్యక్తి మృతి
11-06-2026 12:47 AM
మునిదేవునిపల్లి శివారులో ఘటన
కొండాపూర్, జూన్ 10(విజయక్రాంతి): కొండాపూర్ మండలం మునిదేవునిపల్లి శివారులో ఆటో ఢీకొనడంతో నారాయణ అనే వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ సోమేశ్వరి తెలిపారు. శ్రీశైలం అనే వ్యక్తి మద్యం సేవించి ఆటోను అతివేగంగా, నిర్లక్ష్యంగా నడపంతో ఈ దుర్ఘటన జరిగిందని, కేసు నమోదు చేశామన్నారు.






