5 May, 2026 | 1:53 PM

Breaking News

పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •   “ITP Aero – India” ప్లాంటుకు శ్రీధర్ బాబు శంకుస్థాపన   •  

విద్యుత్ వైర్ తగిలి వ్యక్తి మృతి

25-05-2025 08:51 PM

చిన్నచింతకుంట: విద్యుత్‌ తీగ ప్రమాదవశాత్తు తగిలి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండల కేంద్రంలోని చిన్న వడ్డెమాన్ గ్రామం(Vaddeman Village)లో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... చిన్న వడ్డెమాన్  గ్రామానికి చెందిన బోయ భీమన్న(50) ఇంటి అవసరాల కోసం పొయ్యిల కట్టెలు ఏరుకోవడానికి వెళ్లగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి అక్కడక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని  భార్య చిట్టెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రామ్ లాల్ తెలిపారు.