11-06-2025 11:20:51 PM
నాగారం: సూర్యాపేట జిల్లా(Suryapet District) నాగారం మండల పరిధిలోని నాగారం బంగ్లా క్రాస్ రోడ్ వద్ద బైకును కారు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నాగారం బంగ్లా గ్రామానికి చెందిన దోమల వెంకన్న(47) వ్యవసాయ పనుల నిమిత్తం తన బైక్ పై నరసింహుల గూడెం పొలం వద్దకు వెళ్తుండగా క్రాస్ రోడ్ వద్ద సూర్యాపేట నుంచి వస్తున్న కారు ఏపీ 09 ఏక్యు 0099 బైకును వేగంగా ఢీకొట్టడంతో కింద పడిపోయి తల వెనకాల బలమైన గాయం తగలడంతో స్పృహ కోల్పోయాడు. చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారని అన్నారు. మృతుడికి కూతురు కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఉమరాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఐలయ్య తెలిపారు.