12 April, 2026 | 11:22 PM

దూసుకొచ్చిన మృత్యువు

15-12-2025 09:45 AM

హైదరాబాద్: మెదక్-హైదరాబాద్ రహదారిపై సోమవారం ఉదయం కారు డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ఘోర ప్రమాదం జరిగింది. కొల్చారం మండలం పోతాంశెట్టి టీ జంక్షన్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చిన్న ఘన్‌పూర్‌లోని ఐఎంఎల్ డిపోలో హమాలీగా పనిచేసే శ్రీధర్, కాలినడకన రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న కారు అతడిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన శ్రీధర్ అక్కడికక్కడే మరణించాడు. కరీంనగర్‌కు చెందిన శ్రీధర్ గాంధీ మైసమ్మలో నివసిస్తున్నాడు.స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మెదక్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు.