calender_icon.png 8 June, 2025 | 1:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్యాగాల ప్రతీక బక్రీద్

07-06-2025 07:28:21 PM

ప్రజలకు సమానంగా అందినప్పుడే ఆ త్యాగాలకు సార్థకత..

ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి, మహమ్మద్ అలీ షబ్బీర్..

కామారెడ్డి (విజయక్రాంతి): త్యాగాలకు ప్రతీక బక్రీద్ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్(State Government Advisor Mohammed Ali Shabbir) అన్నారు. శనివారం బక్రీద్(Eid al-Adha) పర్వదిన సందర్భంగా కామారెడ్డి కోర్టు రోడ్డు వద్ద గల ఈద్గాలో బక్రీద్ పండుగ సందర్భంగా నమాజ్ చేసి అందరికి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ... త్యాగాలకు ప్రతీక బక్రీద్ పండుగ అని త్యాగాల ద్వారా ప్రాప్తించిన ప్రయోజనాలు సమస్త జనులకు సమానంగా అందినప్పుడే ఆ త్యాగాలకు సార్థకత చేకూరుతుందనే సందేశాన్ని బక్రీద్‌ పండుగ కలుగచేస్తుందన్నారు. విశ్వమానవాళికి సమానంగా అందిస్తున్నదని ‌తెలిపారు. 

బక్రీద్‌ పండుగ భక్తి, త్యాగం, కరుణ, విశ్వాసం అనే గొప్ప గుణాలను ప్రజల్లో పెంపొందిస్తుందని ప్రసంగించారు. సకల మతవిశ్వాసాలను, సంప్రదాయాలను గౌరవిస్తూ రాష్ట్రంలో దేశంలో పాలన కొనసాగాలని పేర్కొన్నారు. అన్నివర్గాల ప్రజలు శాంతియుతంగా కలిసిమెలసి జీవించేలా, గంగా జమునా తహజీబ్‌ను కాపాడుకుంటూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అల్లాతో ప్రార్థించానని అన్నారు. తెలంగాణ ఆధ్యాత్మిక పరంపరను కొనసాగాలని అల్లా దయ ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.