2 April, 2026 | 3:07 AM

ఘనంగా మణికంఠ స్వామి జన్మదిన వేడుకలు

02-04-2026 01:00 AM

పూల అలంకరణలో దర్శనమిచ్చిన స్వామివారు

పెబ్బేరు, ఏప్రిల్ 1:మున్సిపల్ కేంద్రంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉత్తరా నక్షత్రం సందర్భంగా మణికంఠ స్వామి జన్మదిన వేడుకలను భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్య ప్ప స్వామికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశా రు.అనంతరం స్వామివారిని వివిధ రకాల పూలతో అద్భుతంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు.

ఆలయం ప్రాంగణం స్వామి శరణం అయ్యప్ప నినాదాలతో మారుమోగింది. భజన బృందం సభ్యులు డప్పు, డోలక్, తాళాలతో భక్తి గీతాలను ఆలపించగా, మహిళలు, పెద్దలు కలిసి భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు.భక్తులు సమూహంగా కూర్చొని భజన కీర్తనలు చేయడం, నమస్కార భంగిమలో స్వామివారిని ప్రార్థించడం విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు అల్పాహారం కూడా వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భజన బృందం సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.