09-08-2024 11:12:00 AM
న్యూఢిల్లీ: ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియాకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఢిల్లీ ఎక్సైజ్ పోలీసు కేసుకు సంబంధించిన కేసుల్లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు రద్దు చేసిన ఎక్సైజ్ పాలసీకి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) విచారించిన కేసుల్లో సిసోడియాకు కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. 2023 ఫిబ్రవరి 26న మనీశ్ సిసోదియాను సీబీఐ అరెస్ట్ చేసింది. ఢిల్లీ మద్యం కేసులో 17 నెలల తర్వాత సిసోడియా జైలు నుంచి బయటకు రానున్నారు. ఢిల్లీ మద్యం విధానం అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చింది.
ఏ నిందితుడిని కాలపరిమితి లేకుండా జైలులో ఉంచలేరని ధర్మాసనం పేర్కొంది. విచారణలో పురోగతి లేకపోతే.. పరిమితి దాటాక జైలులో ఉంచలేరని సుప్రీం కోర్టు వెల్లడించారు. జైలులో ఉంచాలనుకుంటే ఆ వ్యక్తి హక్కులు హరించడమేనని తెలిపింది. బెయిల్ కు అప్లికేషన్ పెట్టడం, బెయిల్ పొందడం వారి హక్కు అని వ్యాఖ్యనించారు. సిసోడియాకు బెయిల్ ఇవ్వొద్దన్న దర్యాప్తు సంస్థల వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ట్రయల్ వేగంగా జరిగేందుకు సిసోడియా సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణ జాప్యానికి సిసోడియా కారణమన్న ట్రయల్ కోర్టు ఆదేశాలను సుప్రీం తోసిపుచ్చింది. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు చేసిన ప్రతికూల వ్యాఖ్యలనూ సుప్రీం కోర్టు కొట్టివేసింది. బెయిల్ అనేది నియమం.. జైలు మినహాయింపు అని గ్రహించాలని పేర్కొంది. ఈ విషయాన్ని ట్రయల్ కోర్టులు, హైకోర్టులు గ్రహించాల్సిన సమయం ఆసన్నమైందని సూచించింది.