రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరు పాటించాలి
27-02-2026 04:22 PM
మంథనిలో అరైవ్-అలైవ్ కార్యక్రమంలో మంథని సీఐ రాజు
మంథని,(విజయక్రాంతి): రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరు పాటించాలని మంథనిలో అరైవ్-అలైవ్ కార్యక్రమంలో మంథని సీఐ రాజు సూచించారు. శుక్రవారం మంథని పట్టణంలో సీఐ ఆధ్వర్యంలో అరైవ్-అలైవ్ రోడ్డు భద్రతా కార్యక్రమం 2026లో భాగంగా, మంథని సర్కిల్ పరిధిలోని మంథని, రామగిరి, ముత్తారం పోలీస్ స్టేషన్ పరిధిలోని డ్రైవర్లకు కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 120 మంది డ్రైవర్లు హాజరయ్యారు. అవసరమైన డ్రైవర్లకు సీఐ రాజు కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామగిరి ఎస్ఐ శ్రీనివాస్, ముత్తారం ఎస్ఐ రవి కుమార్ మంథని ఎస్ఐ -2 సాగర్ లతో కలిసి విజయవంతంగా నిర్వహించారు.




