27 February, 2026 | 6:27 PM

రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరు పాటించాలి

27-02-2026 04:22 PM

మంథనిలో అరైవ్-అలైవ్ కార్యక్రమంలో మంథని సీఐ రాజు

మంథని,(విజయక్రాంతి): రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరు పాటించాలని మంథనిలో  అరైవ్-అలైవ్ కార్యక్రమంలో మంథని సీఐ రాజు సూచించారు. శుక్రవారం మంథని పట్టణంలో  సీఐ ఆధ్వర్యంలో అరైవ్-అలైవ్ రోడ్డు భద్రతా కార్యక్రమం 2026లో భాగంగా, మంథని సర్కిల్ పరిధిలోని మంథని, రామగిరి, ముత్తారం పోలీస్ స్టేషన్ పరిధిలోని డ్రైవర్లకు కంటి పరీక్ష శిబిరం  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 120 మంది డ్రైవర్లు హాజరయ్యారు. అవసరమైన   డ్రైవర్లకు సీఐ రాజు కళ్లద్దాలు  పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  రామగిరి ఎస్ఐ శ్రీనివాస్, ముత్తారం ఎస్ఐ రవి కుమార్  మంథని ఎస్ఐ -2 సాగర్ లతో కలిసి విజయవంతంగా నిర్వహించారు.