29-06-2025 01:00:16 AM
మంథని, జూన్-28(విజయక్రాంతి): మం థని సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పని చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. శనివారం మంథనిలో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి నియో జకవర్గంలోని 4 మండలాల అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ మంథని ప్రాంతంలో రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో లేవన్న దుష్ప్రచారం జరుగుతుందని, మన వద్ద అవసరానికి మించి స్టాక్ అందుబాటు లో ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
భవిష్యత్ విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మంథని ప్రాంతంలో అవసరమైన సబ్ స్టేషన్, అదనపు విద్యుత్ లైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. గంగదేవిపల్లిలో సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు వా రం రోజులలో శంకుస్థాపన చేయాలని, మచ్చుపేటలో 132 కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదే శించారు.
మంథనిలో విద్యుత్ సరఫరా హెచ్చుతగ్గులు (ఫ్లక్చువేషన్) జరుగుతుంద ని, దీన్ని వెంటనే ఎస్ఈ ప్రత్యేకంగా సమీక్షించి పరిష్కరించాలని ఆదేశించారు. సన్న బియ్యం సరఫరాకు సంబంధించి ప్రజల్లో వస్తున్న స్పందనను తెలుసుకోవాలని పేర్కొన్నారు. మంథని పరిధిలో కొత్తగా 1,417 రేషన్ కార్డులు జారీ చేశామని, 12,559 సభ్యులకు అదనంగా రేషన్ అందుతుందని చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో కోతలకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు.
మంథని ప్రాంతంలో పైలెట్ ప్రాజె క్టు కింద రేషన్షాపు వద్ద చిన్న సూపర్ మార్కెట్ ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్కు మంత్రి సూచించారు. మంథని ఆసుపత్రికి వచ్చే రోగులను గోదావరిఖని, పెద్దపల్లి ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిం దని, ఈ పద్ధతిని వెంటనే మార్చుకోవాలని ఆదేశించారు. మంథని ఆసుపత్రిలో బయో మెట్రిక్ విధానం ద్వారా అటెండెన్స్ నమో దు చేయాలన్నారు.
మంథని పట్టణ ప్రజల కు తాగునీటి సరఫరా స్థిరీకరణ చేసేందుకు మిషన్ భగీరథతో పాటు పాత వ్యవస్థ పునరుద్ధరణకు ప్రతిపాదనలను వారం రోజుల్లో అందించాలని సూచించారు. మంథని ప్రాం తంలో ఉన్న ఎస్సారెస్పీ కాల్వలలో సిల్ట్ తొలగింపు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంథని ప్రాంతంలో పెండింగ్ ఇరి గేషన్ ప్రాజెక్టుల డీపీఆర్ పూర్తి చేయాలని, అటవీ అనుమతుల మంజూరు ప్రక్రియ, ప్రాజెక్ట్ డీపీఆర్ రూపకల్పన సమాంతరంగా జరగాలని పేర్కొన్నారు.
పోడు భూముల పట్టాలు ఉన్న రైతులను ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులకు గురి చేయొద్దని, ఎక్కడా కొత్తగా అటవీ నరికివేత జరగకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నూతన బస్సు రూటు కనీసం 10 రోజులు నడపాలని తెలిపారు. మంథని డిపో బస్టాండ్ ఆధునీకరణ పనులు ప్రారంభించాలని, త్వరలోనే రవాణా శాఖ మంత్రితో శంకుస్థాపన చేయాలని పేర్కొన్నారు.