calender_icon.png 29 June, 2025 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కోసం కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎం లోపాయి కారి ఒప్పందాలు

29-06-2025 12:58:31 AM

బిజెపి పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు

కరీంనగర్,(విజయక్రాంతి): జరగబోయే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం కాంగ్రెస్, బిఆర్ఎస్ , ఎంఐఎం పార్టీలు ఒకటయ్యాయని, లోపాయి కారి ఒప్పందాలతో  వ్యవహారాలు చేస్తున్నారని బిజెపి పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు అన్నారు. శనివారం కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ కరీంనగర్ లో బిజెపి కున్న విశేష ప్రజాదరణ  కాంగ్రెస్, బి ఆర్ ఎస్ , ఎంఐఎంలకు మింగుడు పడడం లేదన్నారు.

అందుకే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని డివిజన్ల ముసాయిదా, హద్దులలో మార్పులు చేర్పులు ఆయా పార్టీలకు అనుకూలంగా చేపట్టారని ఆరోపించారు. బిజెపిని అడ్డుకోవడానికి ఆ మూడు పార్టీలు అనేక కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ , బిఆర్ఎస్ లకు బిజెపిని ఎదుర్కునే దమ్ము లేక ఎంఐఎంతో జతకట్టి ,కరీంనగర్ మేయర్ పీఠాన్ని ఎంఐఎం కు కట్టబెట్టాలనే పెద్ద కుట్ర  చేస్తున్నారని  ఆరోపించారు. ప్రధానంగా గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో 70 నుంచి 80% ఓట్లు బిజెపికి రావడం, హిందూ సమాజమంతా ఏకతాటిపై నిలబడాన్ని ప్రత్యక్ష పార్టీలు తట్టుకోలేకపోతున్నాయనన్నారు.

ప్రధానంగా కరీంనగర్ మున్సిపల్ ముసాయిదా మార్పుల చేర్పుల తో  ఎంఐఎం కొన్ని స్థానాలు టిఆర్ఎస్ కాంగ్రెస్ కొన్ని స్థానాలు గెలిచి ఎంఐఎం నాయకుడికి మేయర్ కూర్చుని అప్పగించాలనే పెద్ద కుట్ర కు తెర లేపాయన్నారు. మెజారిటీ ప్రజలున్న హిందువులంతా ఈ విషయంలో సీరియస్గా ఆలోచించాలన్నారు. ఎంఐఎం కుట్రలకు,బీఆర్ఎస్ కుతంత్రాలకు.. కాంగ్రెస్ క్రూర నిర్ణయాలకు ప్రజలు తగిన బుద్ధి , గుణపాఠంచెప్పాలని పేర్కొన్నారు.  కరీంనగర్ బల్దియా   ఆ మూడు పార్టీల కబంధ హస్తాల్లో చిక్కకుండా రక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.