calender_icon.png 6 June, 2025 | 9:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఎల్‌జీఏ బెటాలియన్‌కు చెందిన 16 మంది మావోయిస్టులు లొంగుబాటు

03-06-2025 12:15:00 AM

వీరిలో ఒక మహిళా మావోయిస్టు 

ఇద్దరు హార్డ్ కోర్ మావోయిస్టులు  

చర్ల, జూన్ 2 (విజయక్రాంతి):  చర్ల సరిహద్దు రాష్ట్రమైన చతిస్గడ్ రాష్ట్రం  లోని సుక్మా జిల్లా లో  పి ఎల్ జి ఏ బెటాలియన్కు చెందిన ఇద్దరు  హార్డ్కోర్ మావోయిస్టులు ఒక మహిళ మావోయిస్టు తో సహా ఇతర విభాగాలలో చురుకుగా ఉన్న మొత్తం 16 మంది మావోయిస్టులు సో మవారం లొంగిపోయారు. 

లొంగిపోయిన మావోయిస్టులు  ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మొత్తం రూ. 25 లక్షల రివార్డును ప్రకటించింది.  ఛత్తీస్గఢ్ ప్రభుత్వం  ‘మావోయిస్ట్ సరెండర్ రిహాబిలిటేషన్ పాలసీ‘  ‘నియాద్ నెల్లా నార్‘ పథకాలకు ఆకర్షితులై మావోయిస్టులు లొంగిపోతున్నారు, ఆపరేషన్ కగార్ అంతిమ లక్ష్యం ఎన్కౌంటర్ ప్రభావంతో , వివిధ అంతర్గత ప్రాంతాలలో నిరంతరం కొత్త భద్రతా శిబిరాలను ఏర్పాటు చేయడం తో పోలీసుల ప్రభావం పెరుగుతుండటం ద్వారా ప్రభావితమై లొంగిపోవడం జరిగింది . 

అత్యంత సున్నితమైన అంతర్గత ప్రాంతాలలో నిరంత రం శిబిరాలను ఏర్పాటు చేయడం, మావోయిస్ట్  అమానవీయ, నిరాధారమైన భావజాలం మ రియు వారి దోపిడీ, బాహ్య మావోయిస్ట్  దురాగతాలు, వివక్షత, స్థానిక గిరిజనులపై హింస కారణంగా పెరుగుతున్న పోలీసుల ప్రభావంతో విసిగిపోయిన సుక్మా జిల్లాలోని మావోయిస్టులు సీనియర్ అధికారుల మార్గదర్శకత్వంలో  సుక్మా పోలీసు సూపరింటెండెంట్  కిరణ్ చవాన్, సిఆర్పిఎఫ్ 226 బెటాలియన్ సెకండ్ కమాండ్ ఆఫీసర్  వీరేంద్ర కుమార్ ఖట్వాల్, అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నక్సల్ ఆప్స్ సుక్మా  ఉమేష్ ప్రసాద్ గుప్తా మరియు డిప్యూటీ సూపరింటెండెంట్  మనీష్ రాత్రే పోలీస్ మావోయిస్ట్ ఆప్స్ సుక్మా,  సిల్క్ రామ్ అసిస్టెంట్ క మాండెంట్ 218 బెటాలియన్  సిఆర్పిఎఫ్  శశాంక్ సిన్హా అసిస్టెంట్ ఆయుధాలు లేకుండా క మాండెంట్ 226 బెటాలియన్  సిఆర్పిఎఫ్  (క్యాంప్ నర్సపురం) లో లొంగిపోయారు పైన పే ర్కొన్న  లొంగిపోయిన మావోయిస్టులకు  ప్రభుత్వ కొత్త పునరావాస విధానం ‘ఛత్తీస్గఢ్ నక్సలై ట్ సరెండర్ రిహాబిలిటేషన్ పాలసీ-2025‘ కింద ఒక్కొక్కరికి రూ. 50,000 ప్రోత్సాహక మొత్తం మరియు ఇతర సౌకర్యాలు అందించబడతాయి అని తెలియ చేసారు.