03-06-2025 12:15:00 AM
మలక్పేట్, జూన్ 2 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ పురస్కరించుకొని ఆజంపురాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద మాజీ హోం మంత్రి మహమూద్ అలీ జాతీయ జెండాను ఎగరవేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలోని అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందన్నారు. కార్యక్రమంలో ఆజం అలీ, కొరుడు భూమేష్, లాయక్ అలీ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏక్తా జన శక్తి ఆధ్వర్యంలో..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏక్తా జనశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు రాజేష్ యాదవ్ అమర వీరులకు పుష్పాంజలి ఘటించారు. అమరవీరుల స్థూపం వద్ద అమరుల త్యాగాలను స్మరిస్తూ నివాళులర్పించారు. తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ.
రాష్ట్రం ఏర్పడి 12వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అన్ని రంగాలలో సంక్షేమాభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు ఈశ్వర్, మొహమ్మద్ ఫరూక్ తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ కార్యాలయంలో..
హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కా ర్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కమిటీ చైర్ పర్సన్ చెకొలేకర్ లక్ష్మి జాతీయ జెండాను ఎగరవేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కో ట్ల శ్రీనివాస్, ఎస్జీఎస్ చిలుక నర్సింహారెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
టీజీఎంఆర్ఎస్ స్కూల్లో..
తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూ ల్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని ప్రిన్సిపల్ కే విద్యాసాగర్ జాతీ య జెండాను ఎప్పుడు వేశారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ విజయ్, షేక్ మునీర్, శ్రీలత, గౌసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.