22 April, 2026 | 2:03 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

గంజాయి ముఠా అరెస్ట్

22-04-2025 12:00 AM

2 కిలోల సరుకు స్వాధీనం

కార్వాన్, ఏప్రిల్ 21: గంజాయి విక్రయిస్తున్న నలుగురిని సోమవారం కమిషనర్ టాస్క్ ఫోర్స్, వెస్ట్ జోన్ బృందం, హుమాయున్ నగర్ పోలీసులు సమన్వయంతో  పట్టుకున్నారు. వివరాలు.. హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని l ఫస్ట్ లాన్సర్లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలోని ఈద్గా గ్రౌండ్స్లో  గంజాయిని విక్రయించి సేవిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

నిందితులైన మొహమ్మద్ సోఫియావుద్దీన్,  సయ్యద్ దావూద్ అలీ, సయ్యద్ రోమన్ అలీ, మొహమ్మద్ అయూబ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితులు మహారాష్ట్రలోని నాగపూర్ తాజ్ బాగ్ దర్గా సమీపంలో నుంచి కొనుగోలు చేసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.