06-06-2025 12:00:00 AM
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డి, జూన్ 5 (విజయ క్రాంతి), శివుని అనుగ్రహం ద్వారానే మార్కండేయుడు చిరంజీవి అయ్యాడు అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన భక్త మార్కండేయ విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా పద్మశాలి సంఘం ప్రతినిధులు సభ్యులు కుటుంబ సమేతంగా పాల్గొని మార్కండేయ విగ్ర ప్రతిష్ట ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ నేను ముస్లిం అయినా మార్కండేయుడు నాతో సేవ చేయించుకునే భాగ్యం కల్పించినందుకు కృతజ్ఞ తూడనయ్యాను. అందరూ కలిసిమెలిసి ఉండి సంఘ అభివృద్ధికి ఆలయ అభివృద్ధికి కృషి చేయడమే కాకుండా మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లామని అన్నారు.
ఆలయ ఆవరణలో అన్ని రకాల అభివృద్ధి పనులు చేసుకుందామని తెలిపారు. భక్త మార్కండేయ స్వామి యంత్ర మూర్తి ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన ప్రతినిధులను పద్మశాలి సంఘం ప్రతినిధులు ఆలయ కమిటీ ప్రతినిధులు శాలువా కప్పి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు, పండ్ల రాజు, కారంగుల అశోక్ రెడ్డి, పద్మశాలి సంఘం ప్రతినిధులు చాట్ల రాజేశ్వర్, చౌకి లక్ష్మీనారాయణ, లక్ష్మీ నర్సింలు, రాజయ్య, కామారెడ్డి పట్టణంలోని అన్నికాలనీల పద్మశాలి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.