17-06-2025 12:00:00 AM
గత రెండు సెషన్ల నష్టాలకు బ్రేక్
ముంబై, జూన్ 16: గత రెండు రోజులుగా నష్టాలతో రోజును ముగిస్తున్న స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 677 పాయింట్ల మేర, నిఫ్టీ 227 పాయింట్ల మేర లాభాలను చవిచూశాయి. ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నా కానీ దేశీయ మార్కెట్లు మాత్రం అదుర్స్ అనిపించాయి. మరీ ముఖ్యంగా ఐటీ, మెటల్, రియల్టీ షేర్ల కొనుగోలు సూచీలకు కలిసొచ్చింది.
సెన్సెక్స్ 0.84 శాతం మేర, నిఫ్టీ 0.92 శాతం మేర లాభపడ్డాయి. సోమవారం ఉదయం 81,034.45 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 677.55 పాయింట్ల లాభంతో 81,796.15 వద్ద, నిఫ్టీ సైతం 24,946 వద్ద రోజును ముగించాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 73 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు ధర 3450 డాలర్లు దాటింది.