15-06-2025 01:17:20 AM
ఆహార ద్రవ్యోల్బణం తగ్గడమే కారణం
ముంబై, జూన్14: వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేండ్ల కనిష్ఠానికి చేరుకుంది. గతేడాది మేలో 4.75 శాతంగా నమోదైన ద్రవ్యోల్బ ణం ఏప్రిల్ 2025లో 3.16 శాతంగా రికార్డయింది. ఇక మే 2025లో 2.82 శాతంగా నమోదయి ఆరేండ్ల కనిష్ఠానికి చేరుకుంది. ఫిబ్రవరి 2019 తర్వాత ఇంత కనిష్ఠ స్థాయి లో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇదే తొలిసారి.
వరుసగా నాలుగో నెలలో కూడా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. ఆర్బీఐ అంచనా వేసిన నాలుగు శాతం ద్రవ్యోల్బణం కంటే ఇది చాలా తక్కువ. వినియోగదారు ఆధారిత ఆహారధరల సూచీ (సీఎఫ్పీఐ) 0.99 శాతానికి చేరుకోవడం రిటైల్ ద్రవ్యోల్బణం ఈ స్థాయిలో తగ్గుము ఖం పట్టేందుకు ప్రధాన కారణంగా అంతా భావిస్తున్నారు.
అక్టోబర్ 2021 తర్వాత ఇం త తక్కువ స్థాయిలో నమోదవడం ఇదే తొలిసారి. ఆర్బీఐ 2026 ఆర్థిక సంవత్సరానికి సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం 3.7 శాతం మేర నమోదవుతుందని అంచనా వేసింది.