31 May, 2026 | 10:14 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

మిట్ట ఆంజనేయస్వామి దేవాలయంలో సామూహిక హోమాలు

06-04-2026 12:00 AM

పెబ్బేరు ఏప్రిల్ 5: పట్టణంలోని శ్రీ మిట్ట ఆంజనేయస్వామి దేవాలయంలో జరుగుతున్న ధ్వజస్థంభ, నవగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు భక్తి పారవశ్యంతో కొనసాగుతున్నాయి. మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజు నిర్వహించిన సామూహిక హోమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య 80కు పైగా దంపతులు ఒకేసారి హోమంలో కూర్చొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అలాగే దేవాలయ కమిటీ సభ్యులు భక్తులకు సముచిత ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. రేపు జరగబోయే ప్రతిష్ట మహోత్సవానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గౌని బుచ్చారెడ్డి , పట్టణ ప్రముఖులు, హిందూ ధార్మిక నిర్వాహకులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.