సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన
31-05-2026 06:52 PM
బోథ్,(విజయక్రాంతి): సోనాల మండలంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది ఫలితంగా మార్కెట్ కు జొన్న పంటను తీసుకువచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పంటను తలవకుండా తార్ పాలిన్ లను కప్పడం జరిగింది. భారీ వర్షంతో జొన్న పంట విక్రయించే మార్కెట్లో నీరు నిలవడంతో రైతులు పంటను వర్షం నుండి కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జొన్న పంటను గోదాములకు సకాలంలో తరలించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.






