07-11-2025 03:07:53 PM
విజయక్రాంతి,పాపన్నపేట: మండల కేంద్రమైన పాపన్నపేట ఉన్నత పాఠశాలలో శుక్రవారం వందేమాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. వందేమాతర(Vande Mataram) గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా పాపన్నపేట తహసిల్దార్ సతీష్, ఎస్సై శ్రీనివాస్ గౌడ్ లు విద్యార్థులకు వందేమాతర గీతం గొప్పతనాన్ని తమ ప్రసంగాలతో వివరించారు. ఈ సందర్భంగా తెలుగు ఉపాధ్యాయులు మంగ నర్సింలు వందేమాతర గీతం పూర్తి సారాంశాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమం పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం వెంకటేశం ఆధ్వర్యంలో కొనసాగింది. ఇందులో పాఠశాల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, నాగరాజు, మోహన్ రావు, రవికాంత్, సుభాష్, రియాజ్, జాకీర, లక్ష్మి, రజిత, తదితరులు పాల్గొన్నారు. స్థానిక సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద మండల బీజెపీ ఆధ్వర్యంలో, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కార్యక్రమం నిర్వహించారు.