15-08-2025 09:21:35 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కురవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయంలో శ్రావణమాసం శుక్రవారం సందర్భంగా మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.
దేవాలయాన్ని సందర్శించిన దివంగత ఎస్పీ బాలు కుటుంబ సభ్యులు
కురవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయాన్ని ప్రముఖ సినీ నేపద్య గాయకుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సతీమణి సావిత్రి కుటుంబ సభ్యులతో సందర్శించారు.