03-12-2025 12:00:00 AM
పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
చిన్న చింతకుంట డిసెంబర్ 2 : మండల కేంద్రంలోని ధమగ్నపూర్ గ్రామంలో ఎమ్మెల్యే మంగళవారం మూసాపేట మండల పరిధిలోని తునికినిపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ ముఖ్య నాయకులు నాగరాజు , కార్యకర్తలు అదేవిదంగా మూసాపేట మండలానికి చెందిన బిఆర్ఎస్ మైనారిటీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు,
ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే జియంఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ నియోజక వర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న దేవరకద్ర ఎమ్మెల్యే నాయకత్వాన్ని మెచ్చి, కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న కార్యకర్తలు క్ర ఎరజ్ఞితలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మూసాపేట మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.