10 March, 2026 | 7:37 PM

Breaking News

జిల్లా పరిషత్ పాఠశాలకు బీరువాలు, కార్పెట్లు అందజేసిన సర్పంచ్   •   సమస్యల పరిష్కారానికి ప్రజా పాలన ఉపయోగకరం   •   వడల్పర్తి గ్రామంలో పశువులకు గాలికుంటు టీకాల కార్యక్రమం   •   పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు   •   జడ్చర్ల ప్రభుత్వాస్పత్రి స్థాయి వంద పడకలకు పెంపు   •   రామారెడ్డి మాజీ జెడ్పిటిసి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం   •   విద్యార్థుల ప్రతిభకు వేదికగా “ది గ్రేట్ ఇంగ్లీష్ గాలా”   •   హెల్మెట్ బరువు కాదు.. బాధ్యత   •   ఆరెంద జడ్‌పిహెచ్‌ఎస్‌లో విద్యార్థులకు ఘనంగా ఫేర్వెల్ వేడుకలు   •   అణగారిన వర్గాల విద్యాభివృద్ధికి జీవితాన్ని అంకితం చేసిన సావిత్రిబాయి ఫూలే   •  

ఎయిడ్స్ రహిత సమాజ స్థాపనకు సహకారం అందించాలి

03-12-2025 12:00 AM

కలెక్టర్ ఆదర్శ్ సురభి 

వనపర్తి క్రైమ్, డిసెంబర్ 2 : ఎయిడ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతిఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని పురస్కరించుకొని జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హెచ్‌ఐవి బాధితులకు చికిత్స, సేవలు అందిస్తున్న సిబ్బందికి మంగళవారం జిల్లా కలెక్టర్ తన ఛాంబర్ లో ప్రశంసా పత్రాలను అందజేశారు.

హెచ్‌ఐవి వ్యాధిగ్రస్తులకు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

ఎయిడ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతిఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాయినాథ్ రెడ్డి, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మల్లికార్జున్, గంధం నాగరాజు, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.