15 March, 2026 | 9:21 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

బాణసంచా పేలి భవనం ధ్వంసం.. 14 మందికి గాయాలు

16-09-2024 01:18 PM

కాకినాడ : అమలాపురం రావులచెరువు ప్రాంతంలోని బాణసంచా కేంద్రంలో సోమవారం పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో 14 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో ఏడుగురికి తీవ్రగాయాలు కాగా ఏడుగురికి స్వల్ప గాయాలైనట్లు వైద్యులు వెల్లడించారు. బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం బాధితులను కిమ్స్ కు తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోనసీమ జిల్లా ఎస్పీ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అటు ఎమ్మెల్యే ఆనందరావు ఆసుపత్రికి వెళ్లి బాధితులను పలుకరించి పరామర్శించారు.