14-06-2025 12:23:01 AM
నిజాంసాగర్ జూన్ 13(విజయక్రాంతి ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలను నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. గ్రామ పురోహితులు సంజీవ రావు పంతులు సరస్వతి పూజా కార్యక్రమం నిర్వహించి చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు.
కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి తిరుపతిరెడ్డి, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరామిరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవీసింగ్, గ్రామ నాయకులు సంకు లక్ష్మయ్య, పిట్ల సత్యనారాయణ, బాలరాజు, బూమేష్, నవీన్, ఉపాధ్యాయులు సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
అమ్మకు అక్షరాభ్యాసం
కామారెడ్డి, జూన్ 13,(విజయ క్రాంతి): వయసుతో సంబంధం లేకుండా చదువును నేర్చుకోవడం ద్వారా జ్ఞానం పెరుగుతుం దని మండల ప్రత్యేకాధికారి జ్యోతి అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో అమ్మకు అక్షరాభ్యాసం కార్యక్రమంలో భాగంగా వయోజన విద్య, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ చదవడం రాయడం రాని 15 సంవత్సరాలు దాటిన వయోజనులకు చదవడం రాయడం నేర్పాలని అన్నారు.
గ్రామంలో 15 సంవత్సరాలు దాటిన నిరక్షరాసులను ఉల్లాస్ యాప్ ముందు నమోదు చేసి పదిమందికి ఒక వాలంటరీ నియమించి నిర్వహించడం జరుగుతుంద న్నారు. కార్యక్రమంలో ఎంపీడీఏ ప్రవీణ్ కుమార్, ఏం ఈ ఓ విజయ్ కుమార్, ఏ పి ఏం రాజు, గ్రామ సంఘం అధ్యక్షులు, వయోజనులు, సీసీ, విఓఏలు తదితరులు పాల్గొన్నారు.