05-09-2025 01:25:50 AM
నకిరేకల్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): విజ్ఞాలను తొలగించే ఆదిదేవుడు వినాయకుని ఆశీస్సులు అందరిపై ఉండాలని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని పన్నాల గూడెంలో ప్రతిష్టించిన మట్టి గణపతి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వినాయకుని శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాలని సూచించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానికులు ఉన్నారు.