8 July, 2026 | 8:37 PM

Breaking News

ఘనంగా అయ్యప్ప స్వామి 11వ వార్షికోత్సవ వేడుకలు   •   పరిశుభ్రత, పచ్చదనం, ప్రజల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి   •   ఉద్యాన శాఖ సబ్సిడీ పథకాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •  

బోధనాభ్యసన మేళా ద్వారా ప్రాథమికస్థాయిలో బోధనపై మరింత పట్టు

05-09-2025 01:28 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

సూర్యాపేట, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి) : బోధన అభ్యసన మేళా ద్వారా ఉపాధ్యాయులు ప్రాథమిక స్థాయిలో బోధనపై మరింత పట్టు సాధించవచ్చునని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. గురువారం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోనీ రాయినిగూడెం వద్ద గల వికాస్ కాలేజి ఆఫ్ ఎడ్యుకేషన్ లో 1 నుండి 5 తరగతుల వరకు  ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి  బోధనాభ్యసన ప్రదర్శనను  తిలకించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఇలాంటి ప్రదర్శన ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమన్నారు.  ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన 213 స్టాల్స్ ను సందర్శించి  ప్రతి స్టాల్ లో ప్రదర్శించిన బోధన పరికరాల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకొన్నారు.

ఈ ప్రదర్శనలో 8 ఉత్తమమైన  వాటిని ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలు పంపనున్నట్లు తెలిపారు. ఈయన వెంట డి ఈ వో అశోక్, కోఆర్డినేటర్ జనార్ధన్, ఎంఈఓ లు  సకృ నాయక్, లింగయ్య, షరీఫ్, ఉపాధ్యాయులు, అధికారులు ఉన్నారు.