calender_icon.png 6 September, 2025 | 11:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోధనాభ్యసన మేళా ద్వారా ప్రాథమికస్థాయిలో బోధనపై మరింత పట్టు

05-09-2025 01:28:12 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

సూర్యాపేట, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి) : బోధన అభ్యసన మేళా ద్వారా ఉపాధ్యాయులు ప్రాథమిక స్థాయిలో బోధనపై మరింత పట్టు సాధించవచ్చునని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. గురువారం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోనీ రాయినిగూడెం వద్ద గల వికాస్ కాలేజి ఆఫ్ ఎడ్యుకేషన్ లో 1 నుండి 5 తరగతుల వరకు  ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి  బోధనాభ్యసన ప్రదర్శనను  తిలకించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఇలాంటి ప్రదర్శన ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమన్నారు.  ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన 213 స్టాల్స్ ను సందర్శించి  ప్రతి స్టాల్ లో ప్రదర్శించిన బోధన పరికరాల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకొన్నారు.

ఈ ప్రదర్శనలో 8 ఉత్తమమైన  వాటిని ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలు పంపనున్నట్లు తెలిపారు. ఈయన వెంట డి ఈ వో అశోక్, కోఆర్డినేటర్ జనార్ధన్, ఎంఈఓ లు  సకృ నాయక్, లింగయ్య, షరీఫ్, ఉపాధ్యాయులు, అధికారులు ఉన్నారు.