03-07-2025 10:31:58 PM
మేడ్చల్ అర్బన్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తాజాగా ఎన్నికైన మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచందర్ రావు(Ramchander Rao)ను గురువారం మేడ్చల్ బీజేపీ శ్రేణులు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి జ్ఞాపికను అందజేశారు. వారిలో బీజేపీ జిల్లా నాయకులు జగన్ గౌడ్, ఎల్లంపేట్ మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షుడు ఎక్కల దేవి శ్రీశైలం యాదవ్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి రాఘవ రెడ్డి, నాయకులు మహేష్, గౌలికర్ మహేష్ లు ఉన్నారు.