15 June, 2026 | 7:08 PM

Breaking News

అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •   ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   కీతవారిగూడెంలో ఉపాధి హామీ పథకానికి తూట్లు   •  

కిక్ బాక్సింగ్ పోటీల్లో మేడ్చల్ విద్యార్థులకు బంగారు పతకం

23-02-2026 12:54 AM

మేడ్చల్ అర్బన్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): మేడ్చల్ సర్కిల్ పట్టణంలోని చీఫ్ మినిస్టర్ కప్ 2026 కిక్ బాక్సింగ్ పోటీలో పట్టణానికి చెందిన యూనివర్సల్ 369 కిక్ బాక్సింగ్ అకాడమీ స్టూడెంట్ ఠాగూర్ వీరభద్ర సింగ్ అండర్ 14లో 52 వెయిట్ కేటగిరి విభాగంలో బంగారు పతకంతో పాటు 20 వేల నగదు సాధించడం జరిగిందని సీనియర్ మాస్టర్ సాయికుమార్ తెలిపారు.

భవిష్యత్తులో జరగబోయే జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు మేడ్చల్ పట్టణం నుండి యూనివర్సల్ 369 అకాడమీ విద్యార్థులకు తప్పకుండా అవకాశం కల్పిస్తామని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయులు. కార్యదర్శి మహిపాల్.పూర్ణచందర్ కిక్ బాక్సింగ్ కోచ్ జి అక్షయ వెల్లడించారు. అనంతరం కిక్ బాక్సింగ్ కోచ్ అక్షయ, సీనియర్ మాస్టర్ సాయికుమార్ లను అభినందించినట్లు వారు స్పష్టం చేశారు.