15 June, 2026 | 8:17 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

శ్రీనివాస్‌పై చేసిన ఆరోపణలు నిరూపించాలి

23-02-2026 12:54 AM

కామారెడ్డి, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): మాజీ డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు పై ఆర్య వైశ్యుడు అయినా మాజీ బిజెపి ఫ్లో లీడర్ 39వ వార్డ్  కౌన్సిలర్ మోటూరి శ్రీకాంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని చేసిన ఆరోపణలకు రుజువులతో సిద్ధంగా ఉండాలని కామారెడ్డి పట్టణ ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు సవాల్ విసిరారు.

ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చేసిన అవినీతి పై ఆరోపాలు చేస్తూ ఘాటుగా విమ ర్శించారు. వైశ్య సంఘo విలువలు దిగజార్చే విధంగా మాట్లాడడం సభ్యత సంస్కారం మరిచి మాట్లాడిన మోటూరి శ్రీకాంత్ చేసిన ఆరోపణలు రుజువు చేయడానికి కన్యకా పరమేశ్వరి దేవాలయానికి తడి బట్టలతో రావాలని సవాల్ చేశారు. ఆర్యవైశ్యులను షబ్బీర్ అలీ బనియా మక్య లవడాలు అని తిట్టినట్లు ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలను రుజువు చేయాలని వారు డిమాండ్ చేశారు.

మచ్చలేని మా నాయకుడు షబ్బీర్ అలీపై ఆరోపణలు చేయడం నీకు తగునా అని వారు ప్రశ్నించారు. కౌన్సిలర్ గా కొనసాగినన్ని రోజులు నీవు చేసిన అవినీతి చిత్త తమ వద్ద ఆధారాలతో ఉందని నీవు పెట్టుకున్న వాచ్ కూడా అక్రమంగా నిర్మించినఒక బిల్డర్ ఇచ్చిన గిఫ్ట్ కాదా అని వారు ప్రశ్నించారు. ప్లాట్లు తగాదాలు సెటిల్మెంట్స్ చేసి సంపాదించిన అక్రమ సంపాదన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వాటిని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని మా నాయ కుడు కైలాస్ శ్రీనివాసరావు పై చేసిన ఆరోపణలకు రుజువుల తో అమ్మవారు కన్యకా పరమేశ్వరి దేవాలయంలో రుజువు చేయాలని తేదీ సమయం ఎప్పుడు తెలియజేస్తే అప్పుడు మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని వారు అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆర్యవైశ్య ప్రతినిధులు లక్ష్మిరాజ్యం, ముప్పారపు ఆనంద్, గంప ప్రసాద్, పెన్సిల్ వారి శ్రీకాంత్, కైలాస్ లక్ష్మణ రావు, నరహరి, కొత్త బీమారాజ్, రమేష్, శ్రీనివాస్, పార్శి గంగరాజు, చందు పాల్గొన్నారు.