calender_icon.png 13 May, 2025 | 10:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యాధికారులు బాధ్యతగా పనిచేయాలి

13-05-2025 12:38:51 AM

  1. 300 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించిన 

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి 

వికారాబాద్, మే 12: వైద్యాధికారులు బాధ్యతాయుతంగా, సేవా దృక్పథంతో పని చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సోమవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీ సమీపంలో 30 కోట్ల నిధుల వ్యయంతో  నిర్మించిన 300  పడకల సౌకర్యం తో కూడిన ప్రభుత్వ జనరల్   ఆసుపత్రిని శాసనసభ సభాపతి గడ్డం ప్రసా ద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి, శాసన సభ్యులు టి. రామ్మోహన్ రెడ్డి, బి.మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ లతో కలిసి మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభం చేశారు.

అనంతరం కలెక్టరేట్  లోని సమావేశ మందిరంలో సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రుల,  వైద్య కళాశాల నిర్వహణ, మౌలిక సదుపాయాలు, బ్లడ్ బ్యాంక్,  వైద్యుల విధుల నిర్వహణ తదితర అంశాలపై వైద్య అధికారులతో మంత్రి సమీక్షించారు. 

ఈ సంద ర్భంగా అధికారులను ఉద్దేశించి మంత్రి మా ట్లాడుతూ ... జనాభా ప్రాతిపదికన, ప్రజలకు దూరాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు.   అధి కంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను పునఃపరిశీలించి  రోడ్డు భద్రత సమా వేశాలను నిర్వహించి బ్లాక్ స్పార్ట్  లను గుర్తించాలని కలెక్టర్ కు మంత్రి సూచించారు.

ప్రమాదాలు సంభవించిన క్రమంలో సత్వర  వైద్య సేవలు అందించేందుకు ట్రా మా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఒక్కో దానికి 5.5 కోట్ల నిధులను కేటాయించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.  ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తెలిపారు.  డీఎం హెచ్‌ఓ, సూపరింటెండెంట్  లు జావాబుదారితనంతో ఉండాలని మంత్రి తెలిపారు. 

ఆసుపత్రుల్లో సంబంధిత అధికారులు అం దుబాటులో లేకుంటే ఫిర్యాదులు వస్తే చర్య లు తప్పవని మంత్రి తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వేతర ఆసుపత్రులను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారికి మంత్రి ఆదేశించారు. ప్రైవేట్ ఆస్పత్రులు వైద్య పరమైన నిబంధనలకు అనుగుణంగా నడపాలని మంత్రి తెలిపారు. 

 నూతనంగా మంజూరైన వైద్య కళాశాల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.  అధ్యాపకులు, విద్యార్థులు ఇబ్బంది పడకుండా ప్రాధాన్యత క్రమంలో వసతి గృహాలు, సిబ్బంది క్వార్టర్స్ నిర్మాణాలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు.

ప్రస్తుతం నిర్వహిస్తున్న వైద్య కళాశాల, వసతి గృహాలకు సంబంధించి అత్యవసర మరమ్మత్తుల పనులను వెంటనే చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో  డీఎంఇ డాక్టర్ నరెంద్ర కుమార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమీషనర్ అజయ్ కుమార్, అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, ఆర్డీవో వాసు చంద్ర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి లు ఉన్నారు.