calender_icon.png 29 July, 2025 | 8:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి

29-07-2025 01:02:15 AM

బస్తీ దవాఖాన తనిఖీల్లో కలెక్టర్

ఆదిలాబాద్, జూలై 2౮ (విజయక్రాంతి): ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం చేయవద్దని కలెక్టర్ రాజర్షి షా  వైద్య సిబ్బందిని ఆదేశించారు. సోమవారం స్థానిక కే.ఆర్.కే కాలనీ లోని బస్తీ దవాఖాన  ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా దవాఖానలో సరిపడినంత మందుల స్టాక్ ఉందో లేదో అనే విషయాన్ని పరిశీలించారు.

అలాగే రోగులకు అందుతున్న వైద్య సేవల నాణ్యత పై అరా తీశారు. దవాఖాన నిర్వహణకు సంబంధించిన రిజిష్టర్లను, రోగుల నమోదు వివరాలను, ఔషధాల జాబితాను, స్టోర్ రూమ్, అటెండెన్స్ రిజిష్టర్, ప్రయోగశాల పరీక్షలు నమోదు చేస్తున్నది చెక్ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడుతూ వైద్యసేవలు అందిస్తున్న తీరు ను అడిగి తెలుసుకొని, వర్షాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశుభ్రత పాటి స్తూ శుభ్రంగా ఉండాలని సూచించారు.

వైద్య సిబ్బంది సమయపాలన పాటించాల ని, ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే దిశగా కొన్ని సూచనలు చేశారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలులో పారదర్శకత,  సమర్థత ఉండాలన్నా రు. ఈ కార్యక్రమంలో   డాక్టర్ శ్రీనివాస్, స్టాఫ్ నర్స్ సుమలత, ల్యాబ్ టెక్నీషియన్ వెంకన్న,తదితరులు ఉన్నారు.