17 April, 2026 | 11:22 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతు భరోసాకు రామ్ రామ్..

21-06-2025 10:34 PM

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి గోపాల్ పేట,రెవల్లి,ఎదుల మండల నాయకులతో సమావేశం..

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి..

వనపర్తి (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల తరువాత రైతు భరోసాకు కాంగ్రెస్ పార్టీ రామ్ రామ్ పలుకుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Former Minister Singireddy Niranjan Reddy) అన్నారు. శనివారం  జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు ఉమ్మడి గోపాల్ పేట మండలం ముఖ్యనాయకుల స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం అనివార్యం అని అన్నారు. అందుకే బి.ఆర్.ఎస్ శ్రేణులు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలన్నారు. రేపటి నుండి మండలాల ముఖ్యనాయకులు గ్రామాలలో పర్యటించి ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ఎట్లా తూట్లు పొడిచింది అని వివరించండి అదేవిధంగా మన శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు.

ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చిన 420హామీలు, 6గ్యారంటీలు  అమలు చేయడంలో విఫలమై ప్రజలలో చులకన అయ్యిందని ఎన్నికల అంతరం గ్యారంటీగా రైతు భరోసా ఎత్తివేస్తారని జోస్యం చెప్పారు. ప్రజలలో కె.సి.ఆర్ పట్ల,బి.ఆర్.ఎస్ పార్టీ పట్ల ఆదరణ పెరిగిందని ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఎన్నికలలో  పోరాడాలని అన్నారు. పార్టీ పట్ల నిబద్ధత,నాయకుణ్ణి పట్ల విధేయత ప్రజల పట్ల విశ్వాసంతో పనిచేసిన నాయకులను అభ్యర్థులుగా నియమించాలని పిలుపునిచ్చారు. ఎన్నికలలో నాయకులు,కార్యకర్తలు ఏవిధంగా వ్యవహరించి ప్రజలకు చేరువ కావాల్సిన వ్యూహాల గురించి ఆయన వివరించి ఎన్నికలకు సిద్ధం చేశారు. గ్రామాలవారిగా నాయకుల అభిప్రాయాలు స్వీకరించి వాటికి సూచనలు చేశారు.

ఈ సమావేశములో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పట్టణ అధ్యక్షులు పి.రమేష్ గౌడ్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్ మండల పార్టీ అధ్యక్షులు బాలరాజు,శివరాం రెడ్డి,మాజీ జెడ్పిటీసి భీమన్న,మాజీ ఎం.పి.పిలు సంధ్య తిరుపతయ్య,సేనాపతి,మాజీ సర్పంచులు రమేష్,శేఖర్,హర్యానాయక్,మతీన్,బంకల.స్వామి,చిట్యాల.రాము,శ్రావణ్ కుమార్ అన్ని గ్రామాల పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.