21-06-2025 10:36:43 PM
బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు...
ఖమ్మం (విజయక్రాంతి): రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానం అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు(BJP District President Nellore Koteswara Rao) అన్నారు. బీజేపీ 1వ పట్టణ ప్రధాన కార్యదర్శి పాలేపు రాము పుట్టినరోజు సందర్భంగా శనివారం తల సేమియా పిల్లల కోసం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బిజెపి నాయకులు రక్తదానం చేశారు. నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ... రాము జన్మదిననం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దేవకి వాసుదేవరావు, డా. గోంగూర వెంకటేశ్వర్లు, డా. శీలం పాపారావు, బీజేపీ పట్టణ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.