17 April, 2026 | 2:50 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

రక్తదానం మరొకరికి ప్రాణదానం

28-06-2025 12:26 AM

విటల్ హాస్పిటల్ లో మెగా రక్తదాన శిబిరం

నల్గొండ టౌన్,(విజయక్రాంతి): రక్తదానం చేయడం వలన ప్రాణాపాయం లో ఉన్నవారికి ప్రాణదానం చేసినట్లు అవుతుందని విట్టల్ హాస్పిటల్ ఎండి డాక్టర్ విట్టల్ బాబు అన్నారు .హాస్పిటల్ పదవ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక హాస్పటల్లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదాన శిబిరానికి యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తాన్ని డొనేట్ చేశారు .ఈ సందర్భంగా డాక్టర్ విటల్ బాబు మాట్లాడుతూ సరిపోను రక్తం నిలువలు లేక ఎంతో మంది ప్రమాదాలకు గురైన వారు చనిపోతున్నారని అన్నారు. ముఖ్యంగా యువకులు ముందుకు వచ్చి విరివిగా రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలి అన్నారు. రక్తాన్ని కృత్తిమంగా తయారు చేసే అవకాశం లేనందున రక్తదానమే పరిష్కారం అన్నారు.

ఈ రక్తదాన శిబిరంలో   20 మంది పైచిలుకు రక్తదాతలుగా ఆవిర్భవించినారు. ఐఎంఏ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఏ సి హెచ్ పుల్లారావు మాట్లాడుతూ విట్టల్ హాస్పిటల్ 9 వసంతాలు పూర్తిచేసుకుని విజయవంతంగా పదవ సంవత్సరంలోకి అడుగుపెట్టడం అభినందనీయం అన్నారు. హాస్పిటల్ ప్రజల విశ్వాసం పొందిందని అన్నారు. రక్తం నిలువల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని హాస్పిటల్ యజమాన్యం రక్తదాన శిబిరం నిర్వహించడం వలన ఎంతోమందికి ప్రాణాలు పోసినట్లు అవుతుందన్నారు. 

అలాగే ఈ సంవత్సరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ తరపున నాలుగవ(4వ) రక్తదాన శిబిరం గా విటల్ హాస్పిటల్ నందు ఉండటం చాలా హర్షినీయమని అన్నారు. యువత ఇంకా ముందుకొచ్చి తమ స్నేహితులతో  శ్రేయోభిలాషులతో సమాజ బాధ్యతను తమ భుజాలపై తీసుకొని రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం శ్రీవాణి ,డాక్టర్ సుధాకర్ ,డాక్టర్ దామర యాదయ్య, డాక్టర్ విజయకుమార్ ,డాక్టర్ సంధ్యారాణి , డాక్టర్ పద్మ, ఈసం శ్రీకాంత్ ,కెమిస్ట్ డ్రగ్స్ అసోసియేషన్ టౌన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, హోల్సేల్ డీలర్ పవన్, మెడికల్ రిప్రజెంటేటివ్స్, ఆసుపత్రి సిబ్బంది, పాల్గొన్నారు.