calender_icon.png 14 June, 2025 | 5:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముస్సోరీలో మెగా షెడ్యూల్

12-06-2025 12:00:00 AM

చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘మెగా157’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాను షైన్‌స్క్రీన్స్, గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ చిత్రం చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్‌లో ముగిసింది.

ఈ షెడ్యూల్‌లో చిరంజీవి పాల్గొన్నారు. ఇప్పుడు రెండో షెడ్యూల్ కోసం టీమ్ ముస్సోరీకి చేరుకుంది. అక్కడి అందమైన హిల్‌స్టేషన్‌లో 10 రోజుల పాటు కొనసాగనున్న ఈ తాజా షెడ్యూల్‌లో చిరంజీవి, నయనతార, వీటీవీ గణేశ్ తదితర ప్రధాన తారాగణం పాల్గొంటారు. కొన్ని కీలకమైన, వినోదాత్మక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ముస్సోరీ షెడ్యూల్ గురించి తెలియజేస్తూ టీమ్ విడుదల చేసిన ఓ వీడియో ఆకట్టుకుంటోంది. ఇందులో ఒక స్కూల్‌గ్రౌండ్‌లో టేబుల్‌పై కూర్చొని ఉన్న చిరంజీవి వైపు పిల్లలు పరుగెత్తుకుంటూ వస్తుండగా ఆయన థంబ్స్‌అప్ ఇస్తూ కనిపించారు. 2026 సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి సమర్పణ: అర్చన; సంగీతం: భీమ్స్ సిసిరోలియో; డీవోపీ: సమీర్‌రెడ్డి; ఎడిటర్: తమ్మిరాజు.