12-06-2025 12:00:00 AM
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంతో యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ఆదిత్య చోప్రా నిర్మాత కాగా..
ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఇటీవల ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ దేశవ్యాప్తంగా ఒక్కసారిగా సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించి డబ్బింగ్ పనుల్ని షురూ చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేరకు రిలీజ్ చేసిన వీడియో అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది.