07-06-2025 02:08:40 AM
గజ్వేల్:, జూన్6: గజ్వేల్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో శుక్రవారం కాయకల్ప ఎక్సటర్నల్ అసెస్మెంట్ నిర్వహించారు. వైద్యులు డాక్టర్ అమీర్ సింగ్, రేఖా ఆధ్వర్యంలో కాయకల్ప బృందం గజ్వేల్ దవాఖానను పరిశీలించారు. కాయకల్ప సభ్యులు దవాఖానలోని వార్డులు, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, స్వచ్ఛత నిర్వహణ, మురుగు నిర్వహణ, తదితర అంశాలలో దవాఖాలను క్షుణ్ణంగా పరిశీలించి గ్రేడింగ్ చేశారు.
నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ, అసిస్టెంట్ డైరెక్టర్ జయ శ్రీ, ఆర్ఎంవో డాక్టర్ రాము, ఆర్ఎంవో డాక్టర్ మంజుల, డాక్టర్ సుమన్, డాక్టర్ ప్రణీత,డాక్టర్ త్రివేణి, డాక్టర్ సమీక్ష, డ్యూటీ డాక్టర్ శివప్రసాద్, శ్రీనివాస్, నర్సింగ్ సూపరింటెండెంట్ సువర్ణ, స్వరూప రాణి, శ్రీనివాస్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సింగ్ ఆఫీసర్స్ మానిక్య వీణ, మెహరాజ్, కాయకల్ప బృందం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.