calender_icon.png 5 August, 2025 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం

05-08-2025 12:05:57 AM

తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కమ్స్ ఇంటర్ సర్కిల్ హాకీ టోర్నమెంట్, బ్రిడ్జి ఛాంపియన్ షిప్‌ను ప్రారంభించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య 

నిజామాబాద్, ఆగస్టు 4 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో  సోమవారం తెలంగాణ ట్రాన్స్కో, డిస్కమ్స్ ఇంటర్ సర్కిల్ హాకీ టోర్నమెంట్ ,బ్రిడ్జ్ ఛాంపియన్షిప్ కార్యక్రమం వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య,  హాజరై క్రీడలను ప్రారంభించారు. క్రీడా పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు అన్నారు. 

పాటు ప్రతిరోజు పనులపై కార్యాలయానికి వచ్చే వారి నుండి ఒత్తిడికి లోనై ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తులు చేయడంలో బిజీ అయ్యే సిబ్బందికి క్రీడలు ఎంతో మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి అన్నారు. వివిధ పనుల్లో ప్రతినిత్యం  నిమగ్నమైన సిబ్బందికి క్రీడలు మానసిక ఉల్లాసాన్నీ ఇస్తా అన్నారు. ఇలాంటి క్రీడలు ప్రోత్సహిస్తున్నటువంటి మీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ లకు సిపి అభినందనలు తెలిపారు. 

ఇలాంటి క్రీడల వల్ల ఉద్యోగుల మధ్య తత్సమా సంబంధాలు ఉంటాయన్నారు. ఉద్యోగులలో సౌభాతృత్వం ఏర్పడుతుందని సిపి తెలిపారు. ఈ కార్యక్రమాని స్థానిక ఎస్ ఈ ఆపరేషన్ రాపల్లి రవీందర్ అధ్యక్షత వహించారు, ఎస్ ఈ  మాట్లాడుతూ రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల ట్రాన్స్కో డిస్కం హాకీ టోర్నమెంట్ విచ్చేసిన క్రీడాకారులకు స్వాగతం క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ మన ఐక్యత మత్యాన్ని చాటాలని క్రీడాకారులకు ఆయన పిలుపునిచ్చారు.

ఈ క్రీడలు రెండు రోజుల పాటు పోలీస్ పరిరక్షణలో జరగనున్నాయి. ఈ సందర్భంగా విద్యుత్ సౌదా జట్టు కెప్టెన్ శ్రీనివాస్ రెడ్డి అసిస్టెంట్స్ అకౌంట్ ఆఫీసర్ సామాజిక సేవా కార్యక్రమంలో కరోనా సమయంలో కార్యక్రమా పాల్గొన్నందుకు అమెరికన్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొద్దున ఎందుకు కమిషనర్ ఆఫ్ పోలీస్ అతిథులు ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ ఈ ఆపరేషన్ కామారెడ్డి శ్రావణ్ కుమార్ ,ఎస్ ఈ ఓఎంసీ పివి రావు, అడిషనల్ డిసిపి కే రామచంద్రరావు, రాష్ట్ర స్పోరట్స్ ఆఫీసర్ జగన్నాథ్, డీ ఈ లు ఏ రమేష్, విక్రమ్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ ఏడి ఈ తోట రాజశేఖర్ ఏ ఏ ఓ గంగారం నాయక్ జే ఏ ఓ సురేష్ కుమార్ ఏ డి ఈ ఆర్ బాలేష్ కుమార్ ,శంకర్ నాయక్ స్పోరట్స్ సెక్రెటరీ ఏ గోపి, పిఓ పోశెట్టి ,స్పోరట్స్ కౌన్సిల్ ఉత్తం, దినేష్, మూర్తి, సునీత, సీనయ్య, వివిధ సంఘాల నాయకులు రాజేందర్, పి గంగాధర్, చెన్నయ్య, ఐదు జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు నిజామాబాద్ విద్యుత్ సౌదా నల్గొండ కరీంనగర్ వరంగల్ జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు.