21-06-2025 06:16:21 PM
శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్..
ఖమ్మం (విజయక్రాంతి): యోగాతో మానసిక ప్రశంతత చేకూరుతుందని తెలంగాణ శ్రీ చైతన్య విద్యా సంస్థ(Sri Chaitanya Educational Institutions)ల చైర్మన్ మల్లంపేట శ్రీధర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) పురస్కరించుకొని స్థానిక మమత హాస్పిటల్ నందు గల శ్రీ చైతన్య ఇంటర్నేషనల్ ఒలంపియాడ్ పాఠశాలలో శనివారం యోగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి పోటీ ప్రపంచంలో మానసిక ఒత్తిడితో విద్యార్థులు సతమతం అవుతున్నారని, ఈ ఒత్తిడిని కేవలం కొన్ని నిమిషాల పాటు యోగాసనాలు చేయడం ద్వారా విద్యార్థులు అధికమించు కొవచ్చని అన్నారు.
పతంజలి మహర్షి ద్వారా భారత దేశంలో రూపుదిద్దుకుంటున్న యోగాను నేడు ప్రపంచంలోనే దాదాపు అన్ని దేశాలు అనుసరిస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరు ధైనందన జీవితాన్ని ఆహ్లాదంగా గడప వచ్చని ఆయన తెలిపారు. విద్యార్థులు తెలుపు రంగుల దుస్తులు ధరించి పాఠశాల ప్రాంగణంలో యోగాసనాలు చేపట్టారు. ప్రణాయము త్రికోణ, వజ్ర, పర్వతాసనాలు విద్యార్థులకు యోగ గురువు నేర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్లు టిఎల్ఎన్ శర్మ, జి నాగ ప్రవీణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.