31 August, 2026 | 10:25 AM

Breaking News

పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి శ్రీధర్‌బాబు   •   నేడు మహబూబాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన   •   రిటైర్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలి: టీఎస్‌జీఆర్‌ఈఏ జిల్లా అధ్యక్షులు   •   తాజుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్లమెంటరీ నేత   •   జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించం: మాటేటి వేణుగోపాల్   •   ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడిగా పుల్లయ్య   •   గద్వాల మార్కెట్ యార్డులో గంజాయి పట్టివేత..!   •   ఆధ్యాత్మిక వారసత్వాన్ని భావితరాలకు చాటేలా లేజర్‌ షో   •   బీసీ సంక్షేమ సంఘం మహిళా ఉపాధ్యక్షురాలిగా పానుగుళ్ల సుజాత   •  

మెరిట్ స్కాలర్ షిప్ 16 వేలకు పెంపు

23-04-2025 12:00 AM

ఉత్తర్వులు జారీ చేసిన సింగరేణి

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయ క్రాంతి): ఎంసెట్, నీట్, జేఈ ఈ మెయిన్స్, ఎయిమ్స్ తదితర కో ర్సుల ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన సింగరేణి కార్మికుల, అధికారుల పిల్లలకు అందిస్తోన్న వార్షిక స్కాలర్ షిప్ మొ త్తాన్ని రూ.10 వేల నుంచి రూ.16 వేలకు పెంచుతూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. కనీస అర్హత ర్యాంక్‌ను కూడా 2 వేల లోపు నుం చి 8 వేల లోపు వరకు పెంచినట్టు బుధవారం ఒక ప్రకటనలో తెలిపిం ది.

స్కాలర్‌షిప్ మొత్తాన్ని పెంచాలం టూ విజ్ఞప్తులు రావడంతో 2010లో 10 వేల రూపాయలకు పెంచారు. తాజాగా గుర్తింపు కార్మికుల సంఘం తో జరిగిన నిర్మాణాత్మక సమావేశం లో స్కాలర్‌షిప్ మొత్తాన్ని 16 వేలకు పెంచాలని యాజమాన్యానికి విజ్ఞప్తి చేసింది. సానుకూలంగా స్పం దించి న సీఎండీ ఎన్.బలరాం సవరించిన స్కాలర్ షిప్‌కు సంబంధించి ఉత్తర్వులను జారీ చేశారు. అన్ని ప్రాంతాల నుంచి జూన్ 15 లోగా దరఖాస్తులు పంపాలని కోరారు. సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.